మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అమెజాన్ లో సర్కార్ వారి పాట చిత్రం.. కానీ..!!

-

డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట ఈ చిత్రం మే 12న విడుదలై.. మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. కేవలం 12 రోజుల్లో రూ.200 కోట్ల రూపాయిలు క్రాస్ కలక్షన్ చేసి టాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర బృందం ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఇక ఈ సినిమాలో అందరికీ అప్పు ఇస్తూ వడ్డీలు వసూలు చేసే క్యారెక్టర్ లో మహేష్ అద్భుతంగా నటించారు. బడాబాబులు సైతం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎగరగొడితే సామాన్య ప్రజల నుంచి బ్యాంకులు , ప్రభుత్వాలు ఎలా వసూలు చేస్తున్నాయి అనే కోణంలో ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.ఇక ఈ చిత్రాన్ని ఓటీటి లో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా సినీ సర్కిల్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సర్కారు వారి పాట ఓటిటి విడుదల తేదీ విషయంలో రెండు తేదీలు బాగా వినిపిస్తున్నాయి.. జూన్-10 లేదా జూన్ 24వ తేదీన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుందట.

అయితే ఈ సినిమా కూడా పేపర్ వ్యూ కాన్సెప్టులు విడుదల చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా రూ.199 చెల్లిస్తే చూడవచ్చును అన్నట్లుగా తెలియజేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమానులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇక గతంలో కూడా RRR చిత్రం విషయంలో ఇలాంటి నిర్ణయం ZEE -5 తీసుకోగా దీంతో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. ఫ్రీగానే చూడవచ్చని ప్రకటించింది. ఇక కేజిఎఫ్ విషయంలో కూడా అదే విషయాన్ని తీసుకువచ్చింది తాజాగా అమెజాన్. మరి మహేష్ అభిమానులను నిరాశపరుస్తారో లేదంటే ఆనందపడతారో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version