కేసీఆర్,టీఆరెస్ ను బంగాళాఖాతంలో కలిపేయాలి – బండి సంజయ్

-

మూర్ఖత్వపు ముఖ్యమంత్రి కేసీఆర్ ను, టీఆరెస్ ను బంగాళాఖాతంలో కలిపేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నిజమైన ఉద్యమకారులున్న పార్టీ బీజేపీ అని.. ఛత్రపతి శివాజీ, చాకలి ఐలమ్మను ఎవరూ చూడలేదు.. కానీ ఉద్యమకారుల రూపంలో వారిని మనం చూస్తున్నామని వెల్లడించారు. ఉద్యమ ద్రోహులే మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నారు.. తెలంగాణను ఎందుకు సాధించామని ప్రజలు నేడు బాధపడుతున్నారు… దీనికి కారణం కేసీఆర్ అని పేర్కొన్నారు.

ఆత్మహత్యలు ఇంకా ఆగలేదు.. నెరవేర్చలేని హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇంటర్ విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది.. ప్రజల తరపున మరో ఉద్యమం చేస్తాం.. అదే చివరి ఉద్యమం కావాలని కోరారు. ప్రజల తరపున బీజేపీ పోరాడుతుంది.. శక్తి వంతమైన తెలంగాణను నిర్మిస్తామన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ బీజేపీ అని.. తెలంగాణ ఉద్యమ స్పూర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది ఉద్యమకారులు అని వెల్లడించారు. అదే స్ఫూర్తితో ముందుకు సాగుదాం.. పోరాడుదామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version