రంజాన్ పండుగ వేళ ముస్లిం ఉద్యోగులకు శుభవార్త

-

రంజాన్ మాసం ప్రారంభానికి ముందు ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గంట ముందే ఇంటికి వెళ్లేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 12 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి ఏప్రిల్ 14 వరకు సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకుని ఇంటికి వెళ్లొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇస్లాంలో రంజాన్ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉన్న విషయం తెలిసిందే. పవిత్ర గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే దివి నుంచి భువిపైకి అవతరించినందుకు ప్రతీక‌గా ఈ మాసంలో ఉపవాసాలను ఆచరిస్తారు. రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు ఉపవాస దీక్షను ముస్లింలు ప్రారంభించి ప్రార్థనల్లో పాల్గొంటారు. సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం ముస్లింలు ఉపవాస దీక్షను విరమిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version