రేషన్ కార్డు దారులకు శుభవార్త.. ఆ గడువు పొడిగించిన సర్కార్

-

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో బియ్యం పంపిణీ చేసే గడువును కేసీఆర్ సర్కార్ ఐదు రోజులపాటు పెంచేసింది. ప్రతి నెల ఒకటో తేదీన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ పంపిణీ ప్రారంభం అవుతుంది. అలాగే రేషన్ పంపిణీ ప్రక్రియ 15 రోజుల పాటు కొనసాగుతుంది.

ration-cards

అంటే ఆ నెల ఒకటో తేదీన ప్రారంభమైన రేషన్ పంపిణీ ప్రక్రియ అదే నెల 15వ తేదీన ముగుస్తుంది అన్నమాట. అయితే ఈ జనవరి మాసంలో.. కొన్ని అనివార్య కారణాల వల్ల… రేషన్ కార్డులు పంపిణీ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కాలేదు. జనవరి 5వ తేదీ నుంచి బియ్యం పంపిణీ చేశారు రేషన్ అధికారులు. దీంతో… ఈనెల 20వ తేదీ వరకు రేషన్ ను పంపిణీ చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version