పవన్ కల్యాణ్ స్థానంలో సత్యదేవ్..డైరెక్టర్ గోపి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

-

జనసేనాని పవన్ కల్యాణ్ ప్రస్తుతం..వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన సినిమా, రాజకీయం అనే రెండు..జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు. తాజాగా ‘బ్లఫ్ మాస్టర్’, ‘గాడ్సే’ సినిమాల దర్శకుడు గోపీ గణేశ్ పట్టాభి పవన్ కల్యాణ్ పైన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

గోపీ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ‘గాడ్సే’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో సమాజం, వ్యవస్థలోని తప్పులను ఎత్తి చూపే పాత్రలో సత్యదేవ్ కనిపించారు. కాగా, ఈ సినిమా స్టోరిని తాను తొలుత పవన్ కల్యాణ్ కోసం రాసుకున్నానని చెప్పుకొచ్చారు దర్శకుడు గోపి. అయితే, ఈ స్టోరి పవన్ కల్యాణ్ వరకు వెళ్లలేకపోయిందని పేర్కొన్నాడు.

సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు గోపి వివరించారు. చాలా సాఫ్ట్ గా ఉండే ఓ వ్యక్తి..సీరియల్ కిల్లర్ గా మారడానికి గల కారణాలేంటి? అసలు సొసైటీలో జరిగిన తప్పులేంటనే విషయాలపై ‘గాడ్సే’ సినిమా ఉంటుదని దర్శకుడు స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ కోసం రాసుకున్న కథలో అనగా..పవన్ కల్యాణ్ స్థానంలో సత్యదేవ్ నటించాడని అభిమానులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version