దారుణం : పనికిరాడని దివ్యాంగ బాలుడి చంపేసిన తాత !

-

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూర్ గ్రామం లో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నీరడి నవీన్ అనే 15 ఏళ్ళ అనే వికలాంగ బాలుడిని ఎడ్ల కట్ల వాగు వద్ద అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. మూడు రోజుల క్రితం తాత వెంకట్ తో కలిసి నవీన్ మేకలు మేపేందుకు వెళ్ళాడు. ఆరోజు రాత్రి నవీన్ ఇంటికి రాకపోవడంతో గ్రామం అంతా కుటుంబ సభ్యులు వెతికారు. కానీ అతను ఎక్కడా కనపడలేదు.

అయితే తాత కూడా ఎక్కడా కనపడక పోవడంతో ఆ బాలుడిని తాత వెంకట్ చంపి ఉంటాడని మృతుని తల్లి లక్ష్మి అనుమానం వ్యక్తం చేస్తోంది. గతంలో పలుమార్లు నవీన్ తో ఎలాంటి ఉపయోగం లేదని తాత వెంకట్ ఇంట్లో అంటూ ఉండేవాడని, ఆమె చెబుతోంది. అయితే ఇంత అఘాయిత్యానికి పాల్పడతాడని అనుకోలేదని ఆమె అంటోంది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version