కరీంనగర్‌ లో బండి సంజయ్..గుండు పగలడం ఖాయం : గుత్తా సుఖేందర్

-

కరీంనగర్‌ లో బండి సంజయ్..గుండు పగలడం ఖాయమని చురకలు అంటించారు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. మిర్యాలగూడ కాంగ్రెస్ సభలో ఉత్తమ్, జానా రెడ్డిలు టీఆరెస్ పాలనను విమర్శించడం సరికాదని… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నారు, రాదని వారికీ తెలుసు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులు ఇతర పార్టీలకు వెళ్లకుండా కాపాడుకునేందుకే టీఆరెస్ పార్టీ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తన్నుకోవడంలోనే వారి పరిస్థితి ఏమిటో తెలుస్తుందని నిప్పులు చెరిగారు. ఉత్తమ్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం మానడం లేదని.. బాయిల్డ్ రైస్ కొనమని చెప్తున్న బీజేపీని నిలదీయడం లేదని మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సొంత నియోజకవర్గం లో కుంపటి మొదలైంది.బండి సంజయ్ సొంత నియోజకవర్గంలోనే గుండు పగిలే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. సంక్షేమ పాలన టీఆరెస్ పార్టీతోనే సాధ్యం, మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మీ ఆధిపత్యపోరు బరించలేకనే ఆనాడు పార్టీ మారామని… గతంలో సీఎల్పీ నేత గా ఉన్న సమయంలో జానా రెడ్డి టీఆరెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకోలేదా.. అని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version