మరో రికార్డు అందుకున్న హనుమాన్ మూవీ

-

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం హనుమాన్ . సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 350 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది.

ఇటీవల ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజం జీ5లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.జీ 5 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఓటిటిలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ హిట్ మూవీ విడుదలైన 5 రోజులలో 207 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో కథానాయికగా అమృతా అయ్యర్ నటించింది. మరో కీలకపాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది.కె నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హను-మాన్ సినిమాని నిర్మించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version