ప్రేమపేరుతో వేధింపులు.. యువతి దారుణ హత్య

-

ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.ఇంటర్‌ విద్యార్థినిని ఓ యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. అయితే,యువతి అతన్ని తిరస్కరిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే కోపం పెంచుకున్న ఆ యువకుడు ఆమెను హత్యచేసినట్లు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం..సన్నీ అనే యువకుడు గత కొంతకాలంగా అశ్విని అనే యువతిని ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.

యువతి అతన్ని తరచూ నిరాకరిస్తు వచ్చింది.దీంతో కోపంతో రగిలిపోయిన సదరు ఉన్మాది ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి విద్యార్థిని అశ్విని నోట్లో పురుగుల మందు పోసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలం నగరూరులో చోటుచేసుకుంది.విషయం తెలిసిన వెంటనే అశ్విని తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version