అతడిపై కసి తీర్చుకోవాల్సిందే: సన్ రైజర్స్ ఫ్యాన్స్

-

ఈరోజు అహ్మదాబాద్లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే సన్ రైజర్స్ హైదరాబాద్ , కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది. మార్చి 24న సన్రైజర్స్, కోల్కత్తా మధ్య జరిగిన మ్యాచులో మయాంక్ను ఔట్ చేశాక హర్షిత్ రాణా ఇచ్చిన ‘ఫ్లయింగ్ కిస్’ను ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. ఈక్రమంలో నేటి మ్యాచ్లో రాణా బౌలింగ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు సిక్సర్లతో ప్రతీకారం తీర్చుకుంటారని ట్వీట్స్ చేస్తున్నారు. అతడిపై కసి తీర్చుకోవాల్సిందేనని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అంటున్నారు.

కాగా, ఈ స్టేడియంలో రెండు పిచ్లున్నాయి. ఒకటి ఎర్రమట్టిది కాగా రెండోది నల్లమట్టిది. ఎర్ర మట్టి పిచ్పై హైస్కోర్లు నమోదవుతాయి. బ్లాక్ సాయిల్ పిచ్ నెమ్మదిగా ఉండి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. మొదటి పిచ్పై ఇరు జట్లకూ సమానావకాశాలుండగా, నల్ల మట్టి పిచ్ వాడితే మాత్రం మిస్టరీ స్పిన్నర్లున్న కోల్‌కతా నైట్ రైడర్స్ కే ఫలితం అనుకూలం అంటున్నారు క్రీడా విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Latest news