ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీవాసుదేవ్ కి బ్రెయిన్‌ సర్జరీ

-

ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీవాసుదేవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనుకోకుండా సద్గురుకి ఆరోగ్యం సీరియస్‌ కావడంతో హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.మెదడులో బ్లీడింగ్ కావడంతో ఈ నెల 17న ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేశారు.

ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు అపోలో వైద్యులు పేర్కొన్నారు. ఆపరేషన్ తర్వాత ఆయన మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.కాగా, గత కొద్ది రోజులుగా సద్గురు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆస్పత్రిలో చేరారు. వైద్యులు టెస్టులు చేయగా.. ఆయనకు మెదడులో భారీ రక్తస్రావం, వాపు ఉన్నట్లు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news