కరోనా వ్యాక్సిన్లతో దుష్ప్రభావాలు పడిన వారికి గుడ్‌ చెప్పిన WHO..వారికి కోసం ప్రత్యేక.!

-

కరోనాను నివారించడానికి ప్రపంచంలో చాలా దేశాలు వ్యాక్సిన్‌ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి..పలు ఔషధ కంపెనీలతో కలిసి వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ప్రారంభించాయి..కొన్ని ప్రాధమిక దశలో ఉంటే మరికొన్ని హ్యూమన్‌ ట్రయల్స్‌ మూడోవ దశకు చేరాయి..కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌ లో..నివారణ చర్యల్లో భాగంగా వ్యాక్సిన్ల వాడకం వల్ల ప్రజల ఆరోగ్యంపై ఏవైనా దుష్ప్రభావాలు భారిన పడ్డవారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ శుభవార్త చెప్పింది..ఇక నుంచి కరోనా వ్యాక్సిన్ల వాడకంతో అనారోగ్యం పాలైన వారికి తగిన వైద్య సహాయం అందేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ బీమా పథకాన్ని ప్రకటించింది.. ఇందుకుగాను ‘కోవాక్స్’‌ ప్రమోటర్లు, WHO,’గావి’ సంయుక్తంగా ఓ సహాయక నిధిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు సమానంగా అందించడమే లక్ష్యంగా కోవాక్స్‌ కూటమి ఏర్పాటైంది. వ్యాక్సిన్‌ వాడకంపై భయాలు, సందేహాలను తొలగించేందుకే బీమా పథకాన్ని చేపట్టినట్టు కోవాక్స్‌ వివరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version