విజయవాడలో భారీ వర్షం… లోతట్టు ప్రాంతాలు జలమయం

-

దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతు ఉండడంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఆంధ్ర ప్రదేశ్ లోనూ వర్షాలు కురిశాయి.విజయవాడలో ఈరోజు మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.గంటన్నర పాటు కుండపోత వర్షం పడడంతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. అలాగే పలుచోట్ల కాలువలు పొంగిపార్లాయి.

పలు కాలనీల్లో భారీ వర్షపు నీరు రావడంతో మురుగు నీరు రోడ్లపై పారింది. మెఘల్ రాజ్ పురం,ఆటో నగర్, ఏలూరు, బందరు రోడ్డు వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.పలు కాలనీల్లో ఇళ్లలోకి నీళ్లు వెళ్లడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వర్షం నిలిచిన వెంటనే సహాయ చర్యలు చేపట్టి విద్యుత్‌ను పునరుద్ధరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పిడుగులు పడే అవకాశం ఉందని చెట్ల కింద ఉండొద్దని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version