Asia Cup 2022 ; విరాట్ కోహ్లీ సెంచరీ… అనుష్క రొమాంటిక్ మెసేజ్..!

-

ఆసియా కప్ లో భాగంగా నిన్న ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై 101 పరుగులు తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో 61 బంధువుల్లోనే విరాట్ కోహ్లీ 122 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. దాదాపు మూడేళ్ల తర్వాత నమోదు చేసిన ఈ సెంచరీ లో 6 సిక్సర్లు మరియు 12 ఫోర్లు ఉన్నాయి. దీంతో మునుపటి కోహ్లీ గుర్తు చేశాడు.

ఈ సెంచరీ తో మూడు రికార్డులను తన పేరు లిఖిoచుకున్నాడు కోహ్లీ. దాదాపు 1020 రోజుల తర్వాత కోహ్లీ ఈ సెంచరీ చేయడం గమనార్హం. అభిమానుల నిరీక్షణను ఈ సెంచరీ తో ఆయన ముగింపు పలికాడు. కాగా కోహ్లీ తన 71 వ అంతర్జాతీయ శతకం తొలి సెంచరీని భార్య అనుష్క శర్మ, కుమార్తె వమికా కు అంకితం చేశాడు.

కాగా, కోహ్లీ సెంచరీ తనకు అంకితం ఇవ్వడం పట్ల అనుష్క శర్మ కూడా చాలా సంతోషించారు. కోహ్లీ ఫోటో షేర్ చేసి ఆమె రొమాంటిక్ గా స్పందించారు. ‘ఏదైనా నీకోసమే, జీవితాంతం నీతోనే’ అనే అర్థం వచ్చేలా ఆమె పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 1.7 మిలియన్లకు పైగా లైకులు రావడం గమనార్హం. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version