ఓ వ్య‌క్తి వేళ్లు విరిచేసిన హీరోయిన్ తాప్సీ.. ఎందుకో తెలుసా..?

-

‘ఝమ్మంది నాదం’ మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన‌ హీరోయిన్ తాప్సీ తెలియ‌ని వారుండ‌రు. ఇక ప్ర‌స్తుతం ఈ బ్యూటి బాలీవుడ్‌లో ప్రత్యేక పాత్రలు పోషిస్తూ తన దైనశైలిలో దూసుకుపోతోంది. ఈ నేపధ్యంలో అభిమానుల ఆదరణను కూడా సొంతం చేసుకుంటోంది. ఇదిలా ఉంటే.. మహిళలపై ఆకతాయిల పోకిరి చేష్టలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. సెలబ్రెటీలకు సైతం ఇటువంటి వేధింపులు తప్పడంలేదు. తాజాగా ఇలాంటి సంగ‌ట‌నే హీరోయిన్ తాప్సీకి ఎదురైంద‌ట‌. కరీనా కపూర్ షో ‘వాట్ ఉమెన్ వాంట్-2’ లో ఆమె మాట్లాడుతూ.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.

గురుపూజ కోసం ఢిల్లీలోని గురుద్వారాకు కుటుంబ సమేతంగా వెళ్లానని, అప్పుడు అక్కడ విపరీతమైన రద్దీ ఉందని, అదే అదనుగా ఒక ఆకతాయి తనను అసభ్యంగా తాకాడని వెల్లడించింది. తనపై చేతులు వేసి, ఇబ్బందికరంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడని, అతని ప్రవర్తన హద్దు మీరడంతో రెండు వేళ్లు పట్టుకుని విరిచేశానని చెప్పింది. కాగా, ప్ర‌స్తుతం తాప్సీ భారత మహిళ క్రికెట్ జట్టు సారథి మిథాలి రాజ్ బయోపిక్‌లో నటిస్తోంది. ఈ సినిమాను ‘శభాష్ మిథు’ అనే టైటిల్ ఖరారు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version