కేటీఆర్ దాఖలు చేసిన పిటీషన్పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. మహాదేవ్పూర్ పీఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటీషన్ వేశారు. మేడిగడ్డ బ్యారేజీపై అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారంటూ కేటీఆర్పై కేసు నమోదు అయ్యింది.మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతమన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. బ్యారేజీపై డ్రోన్ ఎగురవేయడం వల్ల భద్రతకే ప్రమాదం ఏర్పడుతుంది అని పీపీ తెలిపారు.
మేడిగడ్డ బ్యారేజీని నిషిద్ధ ప్రాంతంగా రాష్ట్రం మాత్రమే నోటిఫై చేసిందన్న కేటీఆర్ తరఫు న్యాయవాది.. నిషిద్ధ ప్రాంతంగా గుర్తిస్తూ కేంద్రం నుంచి నోటిఫికేషన్ వెలువడలేదన్నారు. కాబట్టి ఈ ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ప్రకారం కేవలం జరిమానాతో సరిపెట్టొచ్చన్నారున్న కేటీఆర్ న్యాయవాది. రాజకీయ కక్ష్యల కారణంగానే పోలీసులు మరోసారి సెక్షన్లను మార్చారు అని తెలిపారు. అదే విధంగా పోలీసులు మార్చిన సెక్షన్లు ఈ కేసుకు సరిపోవన్న కేటీఆర్ న్యాయవాది.. సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాలన్నీ ఒకే విధంగా ఉన్నాయి అని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో తీర్పును రిజర్వు చేసింది హైకోర్టు.