ప్రగతి భవన్ వద్ద హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు

-

ప్రగతి భవన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతలు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతలు.. సెక్రటేరియట్ లో కూల్చిన మసీదును.. మళ్ళీ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే .. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ మైనారిటీ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్ మైనారిటీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్ట్ చేసిన వారిని పంజాగుట్ట పోలీసు స్టేషన్ కు తరలించారు పోలీసులు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి వస్తే అన్యాయంగా పోలీసులను పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ మైనారిటీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ లో మజీద్ నిర్మాణం చేయకపోతే ప్రగతిభవన్ లో నమాజ్ చదువుతాం అంటూ హెచ్చరికలు జారు చేశారు కాంగ్రెస్ మైనారిటీ నేతలు. మజీద్ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని కాంగ్రెస్ మైనార్టీ నేతలు డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version