చేనేత కార్మికులకు శుభవార్త.. వాటిపై సబ్సిడీని అందించనున్న ప్రభుత్వం

-

చేనేత కార్మికులకు మంత్రి సవిత శుభవార్త అందించారు. నేతన్నలకు సబ్సిడిపై ముడి సరుకు పనిముట్లు ఇస్తామని అన్నారు.సొసైటీలు ఏర్పాటు చేసి చేనేత కార్మికులను ఆదుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక నేతన్నలకు మరణ శాసనం రాశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు . వైసీపీ పాలనలో ఆప్కో, చేనేతలో భారీగా కుంభకోణాలు జరిగాయని.. వాటన్నింటిపై విచారణ జరిపిస్తామని అన్నారు.ఆప్కో, చేనేత కార్మికులను స్వలాభం కోసం వైసీపీ నాశనం చేసిందని మండిపడ్డారు.

వైఎస్ జగన్ తీరుతో చేనేత కార్మికులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారని ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతన్న పేరుతో కేవలం వైసీపీ కార్యకర్తలకే నేతన్న హస్తం ఇచ్చారని విమర్శించారు. ఆప్కో, చేనేత రంగాల్లోని అవినీతిని ఒక్కొక్కటిగా వెలికి తీస్తామని తేల్చి చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలపై కచ్చితంగా విచారణ జరిపిస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version