13 మంది తెలంగాణ పోలీసులకు కేంద్రం స్పెషల్​ మెడల్స్

-

తెలంగాణకు చెందిన 13 మంది పోలీసు అధికారులను హోం శాఖ మంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్​కు ఎంపిక చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎంపికైన వారిలో ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అనిల్ కుమార్​తో పాటు డీఎస్పీ కె.రవీందర్ రెడ్డి, ఇన్​స్పెక్టర్​ ఎం.వెంకటేశ్వర్లు గౌడ్, నలుగురు ఎస్సైలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నట్లు తెలిపింది.

ప్రతి సంవత్సరం సర్దార్​ వల్లబయ్​ పటేల్​ జయంతిని పురష్కరించుకొని జాతీయ ఐక్యతా దినోత్సవం అయిన అక్టోబర్​ 31న ఈ అవార్డులను ప్రకటిస్తోంది కేంద్ర సర్కార్. గత నాలుగేళ్లుగా తీవ్రవాదం, సరిహద్దు రక్షణ, సరిహద్దు రక్షణ, ఆయుధాల నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేసిన పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ అవార్డులను ఇస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి చెందిన 13 మంది అధికారులను ఎంపిక చేసింది.

కేంద్ర హోం శాఖ మంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్​కు ఎంపికై పోలీసు అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ రాష్ట్ర శాంతిభద్రతలకు కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version