హనీమూన్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తి చేశాకే తాకనిస్తానంటూ భర్తకు షరతు పెట్టింది భార్య సోనమ్. తన బావను తన చెల్లె హత్య చేయించిందని, నేరం రుజువైతే తన చెల్లిని ఉరి తీయాలన్నారు సోనమ్ అన్న గోవింద్. దట్టమైన అడవులతో నిండిన నాంగ్రియాట్ ప్రాంతంలోని కామాఖ్య ఆలయం దగ్గరికి తీసుకెళ్లాలని భర్తను బలవంతం పెట్టింది సోనమ్.

భర్తను హతమార్చేందుకు బాయ్ఫ్రెండ్తో కలిసి పథకం పన్ని దట్టమైన అడవిలోకి తీసుకెళ్లిన సోనమ్… తొలుత నాంగ్రియాట్ ప్రాంతానికి వెళ్లగా అక్కడ పర్యాటకులు ఎక్కువగా ఉండటంతో.. వెయిసావ్రింగ్ జలపాతం వద్దకు తీసుకెళ్లి అక్కడ కిరాయి హంతకు లతో హత్య చేయించింది. భర్త రాజా రఘువంశీని హంతకులకు అప్పగించి, హత్య చేస్తుంటే అక్కడే ఉం డి చూసింది సోనమ్. సోనమ్, ఆమె బాయ్ఫ్రెండ్ రాజ్ కుశ్వాహాదీ, మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు.
పక్కా ప్లాన్ ప్రకారం భర్తను చంపిన సోనమ్
హనీమూన్ హత్య కేసులో సంచలన విషయాలు
తన బావను తన చెల్లె హత్య చేయించిందని, నేరం రుజువైతే తన చెల్లిని ఉరి తీయాలన్న సోనమ్ అన్న గోవింద్
సోనమ్ రాజారఘువంశీ బయటకు వెళ్లినప్పుడు మంగళసూత్రం, ఉంగరం హోటల్లోనే పెట్టి వెళ్లడంతో అనుమానించిన పోలీసులు… pic.twitter.com/9puIj6hsOw
— Telugu Galaxy (@Telugu_Galaxy) June 12, 2025