పీఎం కిసాన్‌.. రూ.2 వేలు వ‌చ్చాయ్‌.. చెక్ చేసుకోండిలా

-

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధుల‌ను విడుద‌ల చేశారు. ఈ ద‌ఫా రూ. 18 వేల కోట్ల రూపాయ‌ల‌ను రైతుల అకౌంట్ల‌లోకి జ‌మ చేశారు. దేశ వ్యాప్తంగా సుమారు 9 కోట్ల రైతు కుటుంబాలు ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధి పొంద‌నున్నారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.2వేలు జ‌మ‌చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌థ‌కం ద్వారా 6 విడ‌త‌లు న‌గ‌దు జమ‌చేశారు.

డ‌బ్బులు ప‌డ్డాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలి..

పీఎం కిసాన్ నిధి ఆర్థిక‌సాయం తమ ఖాతాలో పడిందా లేదా అనే విష‌యాన్ని రైతులు pmkisan.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌లో Kisan Corner అనే ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత స్టేటస్‌లోకి వెళ్లాలి. అక్కడ లబ్దిదారులు తమ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, గెట్ రిపోర్ట్‌ను క్లిక్ చేస్తే పూర్తి వివరాలు పొంద‌వ‌చ్చు.
ఒకవేళ న‌గ‌దు రైతుల అకౌంట్‌లోకి జ‌మ‌కాక‌పోయినా.. రిపోర్టులో FTO (Fund Transfer Order) అని వచ్చినట్టయితే.. లబ్దిదారులు నిరాశ చెందాల్సిన పని లేదు. త్వరలోనే మీ ఖాతాలో డబ్బులు వేస్తారని అర్థం.

పీఎం కిసాన్ టోల్‌ఫ్రీ నంబర్ (PM Kisan Toll free number): 18001155266.

పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ ( PM Kisan Helpline number): 155261.

పీఎం కిసాన్ ల్యాండ్‌లైన్ నంబర్లు (PM Kisan landline numbers): 011—23381092, 23382401, 011-24300606. 0120-6025109.

పీఎం కిసాన్ ఈమెయిల్ ఐడీ: pmkisan-ict@gov.in .

Read more RELATED
Recommended to you

Exit mobile version