ప్రయాణికులకు RTC షాక్..బస్‌ పాస్‌ చార్జీలు భారీగా పెంపు

-

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాల బస్‌ పాస్‌ ఛార్జీలను ఆర్టీసీ పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలులోకి వస్తాయి. జనరల్‌ బస్‌ టికెట్‌ పాసులు భారీగానే పెరిగాయి. ఈ కేటగిరీలో ఆర్డీననరీ పాస్ ఛార్జీ రూ.950 నుంచి రూ.1150 కు మెట్రో ఎక్స్ ప్రెస్‌ రూ.1070 నుంచి రూ.1300 కు, మెట్రో డీలక్స్‌ రూ.1185 నుంచి 1450 కి పెరిగాయి.

అలాగే.. మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2400 కు, పుష్పక్‌ పాస్‌ రూ.2500 నుంచి రూ.3 వేలకు పెరిగింది. ఎన్‌జీఓ బస్‌ పాలకు సంబంధించి ఆర్డీనరీ పాస్‌ ఛార్జీ రూ.320 నుంచి రూ.400 కు, మెట్రో ఎక్స్‌ ప్రెస్‌ రూ.450 నుంచి రూ.550 కి, మెట్రో డీలక్స్‌ రూ.575 నుంచి రూ.700 కు, ఎంఎంటీఎస్‌ – ఆర్టీసీ కోంబో టికెట్‌ ఛార్జీ రూ.1090 నుంచి రూ.1350 కి పెరిగింది. ఇటీవలే సెఫ్టీ సెస్‌ పేరుతో టికెట్‌ పై రూపాయి పెంచి, చిల్లర సమస్య రాకుండా ధరను రౌండాఫ్‌ చేయటంతో గరిష్టంగా టికెట్‌ ధర రూ.5 మేర పెరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version