హైదరాబాద్‌లో కాల్పుల కలకలం..!

-

హైదరాబాద్ లోని నార్సింగి హైదర్‌షాకోట్‌లో కాల్పుల కలకలం రేగింది. గణేష్‌ నిమజ్జనంలో ఆర్మీ మాజీ జవాన్‌ నాగ మల్లేష్ కాల్పులు జరిపాడు. ఇంటి దగ్గర ఇంటర్నెట్‌ సిబ్బంది మందు పార్టీ చేసుకున్నారు. అయితే ఇంటర్నెట్ సిబ్బందిని మల్లేష్ పలుమార్లు వారించినా పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహం చెందిన ఆర్మీ మాజీ జవాన్ రివాల్వర్‌తో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.

ఒకటి గాల్లోకి వెళ్లగా, మరకొటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి చెవి పక్క నుంచి దూసుకెళ్లింది. ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మల్లేష్ ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద ఉన్న రివాల్వర్ ను స్వాధీం చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version