హైదరాబాద్-విజయవాడ రోడ్డుపై వాహనాలకు అనుమతి

-

కృష్ణాజిల్లా కీసర టోల్ గేట్ సమీపంలోని నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద మున్నేరు వాగు హైవే పై ప్రవహిస్తుండటంతో.. గురువారం సాయంత్రం నుంచి విజయవాడ – హైదరాబాద్, హైదరాబాద్ – విజయవాడల మధ్య రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. రాకపోకల నిలిపివేతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలను గుంటూరు మీదుగా మళ్లించినప్పటికీ.. అప్పటికే టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న వాహనదారులు వెనక్కి వెళ్లే దారిలేక తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉద్ధృతి తగ్గింది. ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలను పోలీసులు అనుమతిస్తున్నారు. భారీ వరద నేపథ్యంలో నిన్న రాకపోకలను అధికారులు నిలిపేసిన విషయం తెలిసిందే. దాదాపు 26 గంటల తర్వాత ఆ రూట్లో వాహనాలు తిరుగుతున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version