జబర్దస్త్ లో హైపర్ ఆది డబల్ మీనింగ్ కింగ్..!!

-

తెలుగు ప్రజలకు  జబర్దస్త్ మరియు  ఎక్స్ట్రా జబర్దస్త్ ఎంతగా నచ్చేశయో అందరికి తెలిసిందే. ఇప్పటి వరకు వీటి రేటింగ్స్ ను కొట్టే షో లు రాలేదంటే వీటిని స్టామినా అర్దం చేసుకోవచ్చు. మొదట్లో వీటిలో  పెద్దగా బూతులు లేకుండా వచ్చి ఆకట్టుకున్నాయి. ఇక ఎప్పుడైతే  ఆది జబర్దస్త్ కామెడీ షో టీమ్ లీడర్ అయ్యాడో అప్పటి నుండి షోలో బూతుల వర్షం కురుస్తోంది.

జబర్దస్త్ టీఆర్పి రేటింగ్ అంతలా పెరగటానికి ముఖ్య కారణం హైపర్ ఆది అని మల్లె మాల వాళ్ళకు కూడా తెలుసు. అతని వల్లే రేటింగ్ వస్తుంది అని ఫిక్స్ అయ్యారట. అసలే చాలా మంది టీమ్ లీడర్లు, యాంకర్స్, జడ్జ్ లు వెళ్లి పోయిన జబర్థస్త్ ను హైపర్ ఆది తన డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇక ప్రెసెంట్ యూత్ మాత్రం ఫోన్లో యూట్యూబ్లో ఆది స్కిట్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ఇదిలావుంటే రీసెంట్ గా మల్లెమాల జబర్దస్త్ షో ఈ వారం ప్రోమోను విడుదల చేశారు.ఇక ఈ ప్రోమోలో హైపర్ ఆది ఎప్పటిలాగానే తనలోని డబల్ మీనింగ్ క్రియేటిిటీ ను బయట పెట్టాడు. ఇప్పటికే తాను కొత్త యాంకర్ ను రకరకాల కామెంట్స్ తో గోకాలని చూస్తున్నాడు. ప్రోమో లో జడ్జ్ కృష్ణ భగవాన్ ఈ ప్రపంచంలో అందరూ మరణిస్తే మీరు మాత్రమే ఉంటే ఏం చేస్తారు అని అడిగాడు. దానికి ఆది బదులిస్తూ ఇద్దరూ ఫుల్ గా కాపురం చేసి మరో ప్రపంచం పుట్టిస్తామని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version