నేనే అవినీతి చేయలేదు: అడ్డంగా వాదించిన నగేష్…!

-

మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామీ లపై విచారణ జరుగుతుంది. రెండవ రోజు నిందితుల ఏసీబీ కష్టడీ ముగిసింది. రెండవ రోజు బయట పడింది నగేష్ ముగ్గురు బినామీలు వ్యవహారం. ముగ్గురు బినామీలను విచారించింది ఏసీబీ. నగేష్ బినామీలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి… నగేష్ సమీప బందువు అని గుర్తించారు. మెదక్, మనోహర బాద్, మేడ్చల్ ,కామారెడ్డి లో పలు అక్రమాలను గుర్తించింది ఏసీబీ. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది తో పాటు పలువురు కింది స్థాయి ఉద్యోగుల సైతం విచారించారు అధికారులు.

నగేష్ భార్య పేరు మీద ఉన్న బ్యాంక్ లాకర్ కీ కోసం బ్యాంక్ అధికారుల తో మరో డూప్లికేట్ కీ సిద్ధం చేస్తున్నారు. లాకర్ ఓపెన్ చేస్తే మరిన్ని వివరాకు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు అధికారులు. ఈ కేసుతో నాకు ఏలాంటి సంబంధం లేదని ఏసీబీ విచారణలో నగేష్ స్పష్టం చేసారు. కలెక్టర్ల ప్రమోషన్ లిస్ట్ లో ఉన్న నేను అవినీతి కి ఎందుకు పాల్పడుతానని ఏసీబీ అధికారులను అతను బుకాయించాడు. ఆడియో టేపులు ,అగ్రీమెంట్ పేపర్స్ ,ఆస్తి పత్రాలను ముందుంచి నగేష్ ను ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version