నాకు ప్రజాసేవ తప్ప వేరే కోరికలు లేవు – మంత్రి మల్లారెడ్డి

-

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తనకి రాజకీయ అనుభవం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకి కేవలం ప్రజాసేవ చేయాలనే కోరిక మాత్రమే ఉందన్నారు మల్లారెడ్డి.

సీఎం కేసీఆర్ దీవెనల వల్ల ఎమ్మెల్యే, మంత్రిని అయ్యానని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గానికి తాను వాచ్మెన్ లాగా పనిచేస్తున్నాను అన్నారు మల్లారెడ్డి. మేడ్చల్ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో అందంగా తీర్చిదిద్దానన్నారు. బోడుప్పల్ వక్ప్ బోర్డు సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బిజెపి, కాంగ్రెస్ తో ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని.. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version