రోజుకు రూ.5వేలు ఇస్తేనే కాపురం చేస్తానని, లేదంటే చనిపోతానని తన భార్య వేధిస్తుందని పోలీసులకు ఓ సాప్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకివెళితే.. బెంగళూరు – వయ్యాలికావల్ పీఎస్ పరిధిలో శ్రీకాంత్ అనే సాప్ట్వేర్ ఉద్యోగికి 2022లో ఓ యువతితో పెళ్లైంది. శ్రీకాంత్కు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటంతో ఇంటి నుండే పని చేస్తున్నాడు.
అయితే, ఆ యువతి కాపురం చేయాలంటే రోజు రూ.5000 ఇవ్వాలని, లేదంటే రూ.45 లక్షలు ఇచ్చి విడాకులు తీసుకోవాలని నిత్యం వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘జూమ్’ ద్వారా విధులకు హాజరయ్యే సమయంలో మధ్యలో వచ్చి డ్యాన్స్లు చేస్తూ అకారణంగా తిడుతుందని..ఫలితంగా తన జాబ్ పోయిందని వాపోయాడు. గట్టిగా ఏమైనా అంటే చనిపోతానని బెదిరిస్తుందని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.