మంచు ఫ్యామిలీ వివాదాలు ఇప్పట్లో సర్దుమనిగేలా కనిపించడం లేదు. తాజాగా మరోసారి మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చారు. తన ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు ఏమీ లేవని.. తన అన్నతో మాత్రమే పరస్పద తగాదాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
గతంలో తనపై, తన కుటంబంపై దాడికి యత్నించిన ఆధారాలు పోలీసులకు అందజేసినా వారు ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని.. ఒక్క చార్జిషీట్ కూడా ఫైల్ చేయలేదని మనోజ్ ఆరోపించారు. గత డిసెంబర్ నుంచి ఇప్పుడు ఏప్రిల్ నెల వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తన అన్న విష్ణు ప్లాన్ ప్రకారమే తన కుటుంబపై దాడులు చేయించి, ఆ సీసీ ఫుటేజీని వాళ్లే దాచారని.. అవి ఇస్తే సంగం గుండ కొట్టుకుని తిరుగుతా అని మనోజ్ కీలకవ్యాఖ్యలు చేశారు.
సీసీ ఫుటేజ్ ఇస్తే.. సగం గుండు కొట్టుకొని తిరుగుతా: మంచు మనోజ్
మాపై దాడికి ప్రయత్నించారు.. అందుకు ఆధారాలు ఉన్నాయి.
గతం నుంచి జరుగుతున్న గొడవలపై ఒక్క చార్జిషీట్ కూడా ఫైల్ చేయలేదు.
ఇదంతా మా అన్న విష్ణు ప్లాన్ చేశాడు.
సీసీటీవీ ఫుటేజ్ ఉన్నా వాళ్లు ఇవ్వరు.. ఇస్తే సగం గుండు… pic.twitter.com/dPaO8Io3qk— ChotaNews App (@ChotaNewsApp) April 9, 2025