ఆ విషయంలో ఇప్పటికి బాధగానే ఉంటుంది – మంచు లక్ష్మీ..!

-

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన మంచు లక్ష్మీ ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీగా ఉన్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకుంది. అలాగే మంచు మనోజ్, భూమా మౌనికల వివాహం వెనుక ఉన్న కొన్ని తెలియని విషయాలను కూడా మీడియాతో పంచుకోవడం జరిగింది. మంచు లక్ష్మి మాట్లాడుతూ సాధారణంగా ఎవరైనా ప్రేమించుకుంటే వారు పెళ్లి వరకు వెళ్లడం అనేది ఒక పెద్ద టాస్క్ కానీ మౌనిక మనోజ్ విషయంలో ఇది మరింత కష్టంగా మారింది.

మా రెండు కుటుంబాలకి దాదాపు 15 సంవత్సరాలుగా పరిచయం ఉన్నప్పటికీ వీరి పెళ్లి విషయంలో ఒడిదుడుకులు తప్పలేదు. ఇకపోతే మనోజ్ , మౌనికలు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇంట్లో చెప్పడంతో మొదట్లో తిరస్కరించినా ఇక వారిని ఒప్పించడానికి మరో నాలుగేళ్ల సమయం పట్టింది. ఇక వీరిద్దరి పెళ్లి విషయంలో అందరికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను అంటూ ఆమె తెలిపింది. ఇకపోతే తన వైవాహిక జీవితం గురించి అలాగే తన పిల్లల గురించి కూడా మాట్లాడుతూ ..షాకింగ్ విషయాలు వెల్లడించింది. తనకు నలుగురు పిల్లల్ని కనాలని ఉంది అని కానీ భగవంతుడు కేవలం ఒకరినే ఇచ్చారని.. ఇప్పటికీ ఆ బాధ తీరలేదు అంటూ ఆమె బాధపడింది.

ఇకపోతే రాజకీయాల గురించి కూడా ప్రశ్న ఎదురవడంతో తనకు రాజకీయాలంటే పెద్దగా ఇష్టం లేదు అని సమాధానం ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే మంచు లక్ష్మీ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఎంత ఎదిగిన అంతే ఒదిగి ఉండాలన్న నిర్వచనానికి చక్కటి ఉదాహరణ మంచు లక్ష్మి అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version