కరోనా అప్డేట్ : కేరళలో 30, దేశంలో 44వేల కేసులు..!

-

దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో కేరళలోనే సగానికి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గడచిన 24 గంటల్లో దేశంలో 44,658 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 32,988 మంది కరోనా నుండి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో దేశంలో 496 మంది కరోనా తో మరణించారు. జాతీయ ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం… దేశంలో ఇప్పటి వరకు 32,603,188 కరోనా కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం దేశం మొత్తంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,44,899 గా ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో నాలుగు లక్షల 36 వేల 861 మంది కరోనాతో మరణించారు. ఇక కేసుల సంఖ్య మళ్లీ పెరగడం తో కేంద్రం హెచ్చరిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దశలో ఉన్నామని కేంద్రం చెబుతోంది. దేశవ్యాప్తంగా కేరళ లో ఎక్కువ కేసుల నమోదు అవుతుండడంతో అక్కడ కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version