హోరాహోరీ, తీవ్ర ఉత్కంఠ.. చివరకు ఓటమి.. ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు పరిస్థితి ఇది!

-

టోక్యో: ఒలింపిక్స్‌లో పురుషుల హాకీ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. భారత్, బెల్జియం మధ్య సెమీ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. గెలుపు నీదానాదా? అనే విధంగా హై టెన్షన్స్ నెలకొంది. ఒక సమయంలో భారత్ గెలిచేసింది అనే దిశగా క్రీడాకారులు ప్రదర్శన కనబర్చారు. అయితే మ్యాచ్ చివరకు వచ్చే సరికి నిరాశ మిగిల్చారు. ఫలితంగా బెల్జియంకు విజయం దక్కింది.

సెమీస్‌లో వరల్డ్ డిపెండింగ్ ఛాంపియన్ బెల్జియంపై భారత్ 5-2 తేడాతో ఓటమి పాలైంది. మొదటి క్వార్టర్‌లో 2-1తో ముందజలో ఉన్నా భారత్‌కు రెండో క్వార్టర్‌లో బెల్డియం మరో గోల్ చేయడంతో 2-2తో సమం అయింది. మూడో క్వార్టర్‌లో మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా సాగింది. ఇరు జట్టులు ఒక్క గోల్ కూడా చేయలేదు. దీంతో మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించినట్లు కనిపించింది. నాలుగో క్వార్టర్‌లోనే వచ్చే సరికి చేతులెత్తేసింది. బెల్జియం విజృంభించడంతో 5-2 తేడాతో భారత్  ఓడిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version