ఆసియా కప్ 2023: కష్టాల్లో ఇండియా చేతులెత్తేసిన రోహిత్, కోహ్లీ !

-

ఆసియా కప్ లో భాగంగా ఈ రోజు ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్య పల్లెకేలే స్టేడియం లో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచినా ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలో నాలుగు ఓవర్ ల పాటు వికెట్ కోల్పోకుండా ఆడినా ఆ తర్వాత ఓవర్ లోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయింది. షహీన్ ఆఫ్రిది అద్భుతమైన బౌలింగ్ తో రోహిత్ ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీని సైతం షహీన్ ఆఫ్రిది బౌల్డ్ చేశాడు.. ఆ తర్వాత చాలా విరామం తర్వాత గ్రౌండ్ లో అడుగుపెట్టిన శ్రేయాస్ అయ్యర్ కుదురుకున్నట్లే కనిపించినా, హరీష్ రఫ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఈ వికెట్ తో ఇండియా కేవలం 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.

కానీ వర్షం కారణంగా ప్రస్తుతం ఆట నిలిచిపోయింది.. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సీనియర్ ఆటగాళ్లు రోహిత్ మరియు కోహ్లీలు ఒకే బౌలర్ కు అవుట్ అయ్యి అభిమానుల ఆశలన్నీ వమ్ము చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news