England vs India : తొలి టీ20లో టీమ్​ఇండియా ఘన​ విజయం

-

టీమిండియా మళ్లీ గాడిన పడింది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మొదటి టీ20 లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. హార్థిక్ పాండ్యా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడం కారణంగా ఇంగ్లాండ్ తో 32 టి20 సిరీస్ ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. గురువారం తొలి టీ 20 లో టీమిండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా… 198 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండు ముందు ఉంచింది. 20 ఓర్లలో ఎనిమిది వికెట్ల నష్టపోయి… 198 పరుగులు చేసింది ఇండియా. హార్దిక్ పాండ్యా 51 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 39 పరుగులు అలాగే దీపక్ కూడా 33 పరుగులు చేయడంతో టీమ్ ఇండియాకు భారీ స్కోరు దక్కింది.

అనంతరం 198 లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు… 148 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 19.3 ఓవర్లలోనే ఇంగ్లాండ్ 148 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో ఈ మ్యాచ్ లో టీమిండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు మన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news