అవమానించారు.. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో పాల్గొనం:కేసీఆర్

-

ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో తమ పార్టీ పాల్గొనదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ రాసిన ఆయన.. ‘తెలంగాణ అస్థిత్వాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్ పోకడలను నిరసిస్తున్నాం. ఇకనైనా వైఖరి మార్చుకుని సంక్షేమం కోసం పాటుపడాలి. బీఆర్ఎస్ను రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అవమానించింది’ అని ఆయన పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ దశాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు ఉద్యమకారులతో సహా రాష్ట్రంలోని ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా ఆహ్వానం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి సీఎం రాసిన లేఖతో పాటు ఆహ్వాన పత్రాన్ని హర్కర వేణుగోపాల్‌ అందజేశాము అని తెలిపారు. ఈ మేరకు కేసీఆర్ కూడా పాజిటివ్ గా స్పందించారని నిన్న చెప్పిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version