తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. అసంతృప్తిగా ఉన్న 69 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు రాకపోతే… లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు ఇస్తామని తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

5 లక్షల రూపాయలతో వారి నిర్మాణం పూర్తి చేసుకోవాలని… ఆ దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. సొంత స్థలం లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తామని కూడా వివరించారు. మూడు సంవత్సరాలలో మొత్తం 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని కీలక ప్రకటన చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అందరికీ ఇల్లు వచ్చేవరకు తాను నిద్రపోనని వెల్లడించారు. ఒకవేళ ఇల్లు రాకపోతే మళ్లీ అప్లై చేసుకోవాలని కోరారు.