ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలోకి అమెరికా దిగింది. ఈ మేరకు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలను విజయవంతంగా ధ్వంసం చేశామని తెలిపారు ట్రంప్. ఫోర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్ ను పూర్తిగా మట్టుబెట్టామన్నారు. ఈ దాడులు అద్భుతమైన, సైనిక విజయం అని పేర్కొన్నారు.

ఇరాన్ మన ప్రజలను చంపుతోంది, మిడిల్ ఈస్ట్ లో వందలాది మంది మరణించారన్నారు. ఇరాన్ సృష్టిస్తున్న మారణహోమాన్ని కొనసాగించకూడదని చాలా రోజుల క్రితమే నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇజ్రాయెల్, అమెరికా జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయని వెల్లడించారు. ఇరాన్ పై దాడులు చారిత్రక ఘట్టం అన్నారు. ఇందుకు నెతన్యాహుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వివరించారు డొనాల్డ్ ట్రంప్.