మాంస ప్రియులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలలో ఈరోజు చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత వారంతో పోల్చినట్లయితే చికెన్ ధరలు కిలోపై రూ. 20 నుంచి 30 రూపాయల వరకు తగ్గినట్లుగా తెలుస్తోంది. ఈరోజు హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో కేజీ చికెన్ ధర రూ. 210 వరకు విక్రయిస్తున్నారు. విజయవాడలో రూ. 200 రాజమండ్రిలో రూ. 220 ధరకు అమ్ముతున్నారు.

పలు ప్రాంతాలలో డిమాండ్ ను బట్టి రూ. 260 వరకు విక్రయిస్తున్నారు. దీంతో చికెన్ సంతోషపడుతున్నారు. ఆషాడమాసం ప్రారంభమవుతున్న కారణంగా కోళ్ల ధరలు చికెన్ రేట్లు భారీగా పెరుగుతాయని చికెన్ షాప్ యజమానులు చెబుతున్నారు. బోనాల పండుగ ప్రారంభం అయిన వెంటనే చికెన్ ధరలు భారీగా పెరుగుతాయని చెబుతున్నారు.