ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దింతో భారత్, చైనా సహా ఆసియా దేశాలకు నిత్యం చమురు సరఫరా అయ్యే కీలక మార్గం కావడంతో దాన్ని మూసేస్తే చమురు సంక్షోభం తలెత్తుతుందనే భయాలు నెలకొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 20 శాతం చమురు హర్ముజ్ జలసంధి గుండానే సరఫరా అవుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఇక అటు ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలోకి అమెరికా దిగింది. ఈ మేరకు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలను విజయవంతంగా ధ్వంసం చేశామని తెలిపారు ట్రంప్. ఫోర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్ ను పూర్తిగా మట్టుబెట్టామన్నారు. ఈ దాడులు అద్భుతమైన, సైనిక విజయం అని పేర్కొన్నారు.