స్త్రీలు ధరించే ఆభరణాల వెనుక కారణాలు ఇవే..!

-

స్త్రీలు అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. చీరలు, ఆభరణాలు వంటి ఎన్నో వాటిని ఉపయోగించి అలంకరించుకుంటారు. అయితే వాటి వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ప్రతి ఆభరణం వెనుక ఒక కారణం ఉంది. స్త్రీలు సౌభాగ్యానికి మాత్రమే అలంకరించుకోవడం కాకుండా, ఆభరణాల వలన ఎంతో ఉపయోగం ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. మంగళసూత్రాన్ని పెళ్లయిన స్త్రీలు తప్పకుండా ధరిస్తారు. అయితే ఇది కేవలం సౌభాగ్యానికి చిహ్నం మాత్రమే కాదు, భర్త ఆయుష్షుని మంగళసూత్రం పెంచుతుంది అని అందరూ నమ్ముతారు.

పాపిడి బిళ్లను ధరిస్తే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాకుండా, జ్ఞానాన్ని మరియు అంతర్దృష్టిని పెంచుకోవచ్చు. చాలా మంది అలంకరణ కోసం నడుముకి వడ్డానాన్ని ధరిస్తారు. ఎప్పుడైతే వడ్డానాన్ని ధరిస్తారో, నడుము చిన్నగా కనిపిస్తుంది. పైగా వడ్డనాన్ని ధరించడం వలన జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కాళ్లకు పట్టీలను స్త్రీలు ధరించడం వలన శరీరంలో ఉండే వేడి తగ్గుతుంది. పైగా పట్టీలను ధరించడం వలన శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. స్త్రీలు నెక్లెస్‌లను ధరించడం వలన ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. అంతేకాకుండా చాలామంది దేవుడు చిహ్నాలు ఉండే నెక్లెస్‌లను ధరిస్తారు. దాని వలన భగవంతుడి ఆశీస్సులు కూడా పొందవచ్చు.

సహజంగా పెళ్లి అయిన తర్వాత స్త్రీలు మెట్టెలను ధరిస్తారు. వేలి నరానికి, గర్భాశయానికి లింక్ ఉంటుంది. కనుక ఈ విధంగా ధరించడం వలన గర్భాశయ ఆరోగ్యం బాగుంటుంది అని నిపుణులు చెబుతున్నారు. చెవి దిద్దులను ధరించడం వలన ఎంతో అందంగా కనిపించడంతో పాటుగా, కంటికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. స్త్రీలు గాజులను ధరించడం వలన రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. పైగా గాజుల శబ్దం ఇంట్లో శుభాన్ని పెంచుతుందని అందరూ నమ్ముతారు. స్త్రీలు ముక్కు పడుకును ధరించడం వలన ప్రసవ సమయంలో నొప్పి తగ్గుతుంది అని ఆయుర్వేదం చెబుతోంది. కనుక, ఇటువంటి ఆభరణాలను ధరించి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news