మ్యారేజ్ హాల్​లో ఘోర అగ్నిప్రమాదం.. 100 మంది సజీవదహనం.. మరో 150 మంది..?

-

ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెళ్లి మండపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 100 మంది సజీవదహనమయ్యారు. మరో 150 మంది గాయపడ్డారు. మంటలు చెలరేగగానే హాల్​ పాక్షికంగా కుప్పకూలిందని పౌర రక్షణ అధికారులు తెలిపారు. భారీ మంటలకు ధ్వంసమయ్యే నాసిరక మెటీరియల్​తో ఈ భవనం నిర్మించినట్లు చెప్పారు. పెళ్లి మండపంలో అగ్నిమాపక పరికరాలు లేకపోవడం వల్లే మంటలు భారీగా వ్యాపించినట్లు స్థానికులు అంటున్నారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. భారీగా మంటలు భారీగా చెలరేగడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రాజధాని బాగ్దాద్​కు వాయువ్యంగా 335 కిలోమీటర్ల దూరంలో ఉన్న నినెవే ప్రావిన్స్‌లోని హమ్దానియా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని నినెవే ప్రావిన్స్‌ గవర్నర్​ నజిమ్​ అల్​ జుబౌరీ తెలిపారు.

ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పెళ్లి మండపంలో బాణాసంచా భారీగా కాల్చడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని కుర్దిష్​ టెలివిజన్​ ఛానెల్​ అనుమానం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version