ఐపీఎల్ 2020 నిర్వహణకు న్యూజిలాండ్ ఆసక్తి …!

-

రోజురోజుకు భారత్ లో కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 2020 సీజన్ రోజురోజుకీ జరుగుతుందో, జరగదో అన్న అనుమానం అభిమానులలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే బీసీసీఐ ఐపీఎల్ 2020 సీజన్ ను దుబాయ్ లేదా శ్రీలంక దేశాలలో వేదికగా మ్యాచ్ నిర్వహించాలని ఆలోచన చేస్తోంది.

ipl 2020

ఇకపోతే తాజాగా న్యూజిలాండ్ కూడా ఆ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేకపోవడంతో, తమ దేశంలో మ్యాచులు నిర్వహించాలని ఆ దేశం ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారిక వర్గాలు తెలిపాయి. నిజానికి ఇప్పటికే రెండు పర్యాయాలు విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించారు. ఇకపోతే మార్చి నెలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందిరికి వీలయ్యేలా మొదటగా తేదీలను ప్రకటించిన నేపథ్యంలో అది కాస్త వాయిదా పడుతూ వస్తోంది. కాకపోతే, ఈసారి కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ భారత్ లో నిర్వహించడం కష్టం గానే ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version