ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దంతెవాడ – బీజాపూర్ సరిహద్దుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దంతెవాడ పోలీసులు సోమవారం ఉదయం స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ క్రమంలోనే మావోయిస్టులు వారికి ఎదురుపడగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఇరుపక్షాల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు మహిళా అగ్రనేత రేణుక స్పాట్లోనే మృతి చెందింది. మిగతా దళ సభ్యులు పోలీసులు కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకున్నారు.ఈ మేరకు దంతెవాడ పోలీసులు రేణుక మృతదేహంతో పాటు తుపాకీ, మందుగుండు సామగ్రి, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.