ఐపిఎల్ 2023: నిప్పులు చెరిగే బంతులతో SRH ను వణికించిన మహమ్మద్ షమీ… !

-

ఐపిఎల్ లో ఈ రోజు మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ గుజరాత్ 188 పరుగులు చేసి SRH ముందు 189 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చేదనలో భాగంగా బ్యాటింగ్ కు వచ్చిన SRH ను మొదటి బంతి నుండి గుజరాత్ కుదురుకోనివ్వలేదు.. వరుసగా వికెట్లను తీస్తూ SRH పై ఒత్తిడి పెంచింది. ఈ పిచ్ మీద 189 పరుగులు చేరుకోవడం అంత కష్టం కాకపోయినా, SRH స్ట్రగుల్ అయింది. అనుకున్నట్లే గుజరాత్ స్వింగ్ బౌలర్ మహ్మద్ షమీ SRH ను తన పదునైన నిప్పులు చెరిగే బంతులతో వణికిస్తున్నాడు. పవర్ ప్లే లో పదునైన బంతులతో వికెట్లు తీయగల సత్తా ఉన్న షమి మరోసారి SRH ఆటగాళ్లలో ఆడుకున్నాడు.

షమీ దెబ్బకు SRH మొదటి పవర్ ప్లే లోనే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఇందులో షమీ మూడు వికెట్లు పడగొట్టి గుజరాత్ కు శుభారంభం అందించాడు. షమీ ఖాతాలో అన్మొల్ ప్రీత్ సింగ్, మార్ క్రామ్ మరియు త్రిపాఠి లు ఉన్నారు. ప్రస్తుతం టాప్ ఆర్డర్ మొత్తం పెవిలియన్ కు చేరుకుంది. ఇక SRH గెలవడం దాదాపు అసాధ్యం అని చెప్పాలి. మరి చూద్దాం మిగిలిన ఆటగాళ్ళు SRH ను ఆదుకుని గెలిపిస్తారా ?

Read more RELATED
Recommended to you

Exit mobile version