IPL 2024: హైదరాబాద్ లో వర్షం.. ఒకవేళ మ్యాచ్ రద్దయితే..

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ , గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది .అయితే ఈ మ్యాచ్ హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న విషయం తెలిసిందే.  వాతావరణ శాఖ మొదటి నుంచి చెబుతున్నట్టుగానే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉప్పల్నూ మబ్బులు కమ్మేయడంతో సన్రైజర్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ  ఈ మ్యాచ్ రద్దయినా హైదరాబాద్ జట్టుకు ఎలాంటి నష్టం ఉండదు. మరో లీగ్ మ్యాచ్ మిగిలుండగానే 15 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. గుజరాత్ ఇప్పటికే ఎలిమినేట్ కావడంతో ఆ జట్టుకు ఇది నామమాత్రపు మ్యాచే.

ఇదిలా ఉంటే… సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్లలో 7 గెలిచి నాలుగో స్థానంలో ఉండగా, గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్లలో ఐదు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news