IPL 2024 : మ్యాచ్ అనంతరం సంజూ శాంసన్ అసహనం

-

ఐపీఎల్లో నిన్న గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం ఇంటర్వ్యూలో కెప్టెన్ సంజూ శాంసన్ నవ్వుతూనే కొంత మేర అసహనం వ్యక్తం చేశారు. ‘మేం ఆఖరి బంతికి ఓడామనుకుంటా. నిజం చెప్పాలంటే, గేమ్ పూర్తైన 5 నిమిషాలకే ఓడిపోయిన జట్టు కెప్టెన్ వచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడటం, ఓటమికి కారణాలను చెప్పడం చాలా కష్టమైన పని అని అన్నారు . కొన్ని గంటల తర్వాతైతే చెప్పగలమేమో’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా, నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ఈ సీజన్ నెంబర్ వన్ జట్టును గుజరాత్ టైటాన్స్ మట్టి కల్పించింది. ఈ మ్యాచ్ లో కేవలం 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.

చివరి వరకు పోరాడి జట్టును గెలిపించాడు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రషీద్ ఖాన్. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్… చివరి వరకు పోరాడింది. చివర్లో తేవాటియ, రషీద్ ఖాన్ ఆకట్టుకోవడంతో ఏడు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news