IPL 2024 : సూపర్ స్టార్ మహేష్ బాబుతో సన్ రైజర్స్ కెప్టెన్..

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు కలిశారు. హైదరాబాద్లోని ఓ స్టూడియోలో కెప్టెన్ పాట్ కమిన్స్, బ్యాటర్ మయాంక్ అగర్వాల్.. మహేశ్తో ముచ్చటించారు. ‘ది ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్తో మేము’ అంటూ అందుకు సంబంధించిన ఫొటోలను మయాంక్ ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు. ఓ యాడ్ షూట్ కోసమే వారు కలిసినట్లు తెలుస్తోంది.

కాగా, సన్రైజర్స్ ఆటగళ్ళు హెడ్ , క్లాసేన్,మార్కరం, అభిషేక్ శర్మ ఈ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నారు. ఈ సీజన్లో ఏకంగా 250 ప్లస్ స్కోర్ ఇప్పటికే మూడుసార్లు సాధించడంతోపాటు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేశారు.ఇక హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్ను ఈ నెల 25న ఆర్సీబీతో ఆడనుంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్లలో ఐదు మ్యాచ్లలో గెలిచి పాయింట్ల పట్టికలో మూడు స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news