IPL 2024 : ప్లే ఆఫ్ మ్యాచ్ లకు టికెట్స్ బుకింగ్ ప్రారంభము

-

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఐపీఎల్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఎక్కడ మ్యాచ్ జరిగిన వేల సంఖ్యలో అభిమానులు స్టేడియాలకు అధిక సంఖ్యలో వస్తున్నారు.ఇందులో ఆయా జట్ల హోం గ్రౌండ్ మ్యాచుల్లో అయితే టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. టికెట్లను ఆన్ లైన్ లో పెట్టిన నిమిషాల వ్యవధిలోనే అన్ని టికెట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 64 మ్యాచులు పూర్తవ్వగా మరో 10 మ్యాచులు మాత్రమే ఉన్నాయి. అనంతరం ప్లే ఆఫ్ లో భాగంగా మే 21న క్వాలిఫైయర్ 1,మే 22న ఎలిమినేటర్ మ్యాచులు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్నాయి.

మే 24న క్వాలిఫై యర్ 2 చెన్నైలోని చెపాక్ స్టేడియం లో, మే 27 ఐపీఎల్ ఫైనల్ మ్యాచులు జరగనున్నాయి. ఈ క్రమంలో మే 21 క్వాలిఫైయర్ 1, మే 22న ఎలిమినేటర్, మే 24న క్వాలిఫై యన్ 2 మ్యాచులకు సంబంధించి బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి టికెట్లు అందుబాటులోకి రాగా నిమిషాల వ్యవధిలోనే అన్ని అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news