IPL : క్రికెట్ ఆడటంపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన ఎంఎస్ ధోని!

-

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని వచ్చే 2025 ఐపీఎల్ సీజన్ ఆడతారా? లేదా అనే విషయంపై సందిగ్దం నెలకొంది. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది మాజీలు స్పందించారు.ధోని వచ్చే సీజన్ ఆడతారని ఎవరి వెర్షన్ వారు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్లకు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం మహి కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. ప్రస్తుతం చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్న ధోని.. గతేడాది కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుని అందరినీ షాక్‌కు గురిచేశాడు. ఈసారి అతను చెన్నయ్ జట్టుకు మెంటార్‌గా కొత్త అవతారం ఎత్తనున్నారని, మైదానంలో కనిపించరని ఊహగానాలు పెద్ద ఎత్తున వినిపించాయి. వీటన్నింటికీ ధోని తాజాగా చేసిన కామెంట్స్ చెక్ పెట్టాయి. ఓ ఈవెంట్లో పాల్గొన ఆయన తాను మరొకొన్నేళ్లు క్రికెట్‌ను ఆస్వాదిస్తానని చెప్పారు. మైదానంలో ప్రొఫెషనల్‌గా ఆడితేనే విజయం సాధించగలమని చెప్పారు.మహి తాజా వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఖుషీ అవుతుండగా.. ఈసారి అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా ధోనిని చెన్నై టీం రిటెన్షన్ చేసుకోనుందని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news