షీ టీమ్స్ హెచ్చరిక.. ఇకపై మహిళలను అలా తాకితే అంతే సంగతులు!

-

హైదరాబాద్ మహానగరంలో మహిళలు, కాలేజీ అమ్మాయిలపై పబ్లిక్ ప్రదేశాల్లో మగవారి నుంచి ఎదురవుతున్న వేధింపులను అరికట్టేందుకు నిఘా నీడలో షీ టీమ్స్ వెంటాడుతున్నాయి. వీకెండ్ పార్టీలు, పబ్బులు, బస్సులు, మెట్రో, షాపింగ్ మాల్స్, అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొందరు ఆకతాయిలు కావాలనే మహిళలను అసభ్యంగా తాకుతుంటారు. మరికొందరు అదే పనిగా వారిని వేధిస్తూ ఉంటారు. అలాంటి వారి రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరాయంగా నిఘా పెడుతున్నాయి.

మహిళలు, అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారిని ఇష్టానుసారం తాకుతూ పైశాచిక ఆనందం పొందేవారిపై నిఘా పెట్టి మరీ అరెస్ట్ చేస్తున్నారు షీ టీమ్స్ పోలీసులు. మహిళలను అసభ్యకరంగా తాకుతున్న 13,895 మందిని షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మరీ మరోసారి ఇలాంటి పనులు చేయొద్దని షీటీమ్స్ హెచ్చరించాయి. రెండోసారి అలాగే దొరికితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news